పెళ్లి అనేది ఇద్దరి మనుషులను దగ్గరి చేస్తుంది.పెళ్లి కుదిరాక అందరికి చెప్పడానికి శుభలేక లు పంచడం మామూలే.
అయితే అదే పెళ్లి పత్రిక కారణంగా పెళ్లి ఆగిపోయిందంటే మీరు నమ్ముతారా.అవునండి ఇది నిజం.
పెళ్ళికి ముద్రించిన శుభలేఖ కారణంగానే వాళ్ళ పెళ్లి ఆగిపోయింది.అది ఎలా జరిగిందా ఆ అని అనుకుంటున్నారా.
అయితే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
పెళ్లిళ్లు కుదిరాక ఏదో కారణంగా చాలా పెళ్లిళ్లు ఆగిపోతూనే ఉంటాయి.
కానీ అవి పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళ వల్లో లేదంటే పెళ్లి కూతురు వాళ్ళింట్లో వాళ్ళ వల్లో చెడిపోయిన సందర్భాలు ఉంటాయి.ఏదైనా గోడలు వస్తే ఆ పెళ్లిళ్లు ఆగిపోతాయి.
కానీ ఇక్కడ మాత్రం కథ వేరే.ఈ పెళ్లి ఇంట్లో గొడవలు కారణంగా ఆగిపోలేదు.
బయట వాళ్ళ వల్ల ఆగిపోయింది.ఎలా అంటే.
వధువు పేరు రసిక.ఆమె తండ్రి ప్రముఖ నగర్ వ్యాపారి.అయితే ఆమె అంగ వైకల్యం కారణంగా పెళ్లి సంబంధాలు ఒక్కటి కూడా కుదరడం లేదు.
అయితే ఆమె స్నేహితుడు ఆసిఫ్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.ఇక్కడే అసలు సమస్య వచ్చింది.అతడు ముస్లిం అయినా కారణంగా ఈ పెళ్లి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇరువురి పెద్దలు అంగీకారంతో ఈ పెళ్లి జరిగేందుకు నిర్ణయించారు.
పెళ్లి కుదరగానే మే నెలలోనే ఇద్దరి కుటుంబాలు కోర్టులో పెళ్లిని రిజిస్టర్ చేయించారు.
ఇప్పుడు జులై 18 న ఈ పెళ్లి నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు.
అందుకోసం శుభలేఖలు కూడా ముద్రించారు.ఈ శుభలేఖ ను వాట్సాప్ నుండి చాలా మందికి పంపారు.ఆ శుభలేఖ చూసిన వారు ఆమెను బలవంతంగా ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని నిరసనలు చేసి వధువు తండ్రికి ఫోన్ చేసి మరి ఈ పెళ్లి ఆపాలని బెదిరించారు.
కమ్యూనిటీ పెద్దలు కూడా పెళ్లి ఆపాలని ఒత్తిడి తీసుకురావడంతో పెళ్లిని ఆపేసారు.ఈ విషయంపై వధువు తండ్రి ప్రసాద్ స్థానిక కమ్యూనిటీ వారికీ ఒక లేఖ రాసాడు.
వారు వధువు ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కుంటే వారిని చేసుకోవచ్చని తెలిపారు.ఇప్పుడు వధువు ఏం చేస్తుందా అని అందరు చూస్తున్నారు.ఒక్క శుభలేఖ ఎంత పని చేసిందో.