టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ ఘటన సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారని ఈటల ఆరోపించారు.బ్రోకర్లు, పైరవీకారులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ విచారణపై ప్రజలకు నమ్మకం లేదని తెలిపారు.ఈ నేపథ్యంలో పేపర్ లీక్ కు బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఈటల స్పష్టం చేశారు.