టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోయిన్ గా మారిన అందాల భామ రాశీఖన్నా.టాలీవుడ్ యువ హీరోలందరితో ఇంచు మించు ఆడిపాడిన ఈ భామ చివరిగా వెంకీ మామా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇక మన తెలుగు భామలకి తమ నటన, గ్లామర్ తో మైమరపించడంతో పాటు అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలతో తమ గొప్ప మనసు చూపిస్తూ ఉంటారు.సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలలో పాల్గొని తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు.
ఇప్పుడు ఈ వరుసలో రాశీ ఖన్నా కూడా వచ్చి చేరింది.ఆమె కూడా ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో భాగం అవుతూ ఉంటుంది.
తాజాగా ఈ భామ ఓ ప్రైవేట్ కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది.కమర్షియల్ లో ఈ పని తనకి గిట్టుబాటయ్యేదే కాని అక్కడ ఈ అమ్మడు మరో మంచి పని చేసింది.
నేత్రదానం ప్రాధాన్యత అందరికి తెలియజేసే విధంగా తాను కూడా కూడా నేత్రదానం చేయడానికి ముందుకొచ్చింది.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.నేను నా కళ్ళు దానం చేశాను? మరి మీరు కూడా చేసారా అంటూ అవగాహనా పెంచే విధంగా పోస్ట్ పెట్టింది.దీనిపై నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తూ కామెంట్స్ పెట్టారు.
మీలాంటి వారు ఇలా ముందుకొచ్చి నేత్రదానంపై అవగాహనా పెంచితే చాలా మంది ప్రజలు కూడా నేత్రదానం చేయడానికి ముందుకొస్తారు అంటూ కామెంట్లు పెట్టారు.అయితే కొందరు ఆమె పోస్ట్ తో పాటు షేర్ చేసిన ఫోటోపై కాస్తా నెగిటివ్ కామెంట్స్ చేశారు.
వారికి తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చింది.మొత్తానికి రాశీ ఖన్నా చేసిన ఈ పనిని మిగిలిన సెలబ్రిటీలు కూడా ఫాలో అయితే బాగుంటుంది అనే అభిప్రాయం వినిపిస్తుంది.