కరోనాతో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత.. !

ప్రజలపాలిట మాయల మరాఠిలా మారిన కరోనా సెకండ్ వేవ్ ప్రజల జీవితాలతో చెడుగుడు ఆడేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఇంతలా కరోనా వ్యాపిస్తున్న జనంలోని చాల మందిలో మాత్రం ఇంకా నిర్లక్ష్యం పోవడం లేదు.

 Leading Producer Salem Chandrasekhar Died Of Corona, Leading Producer, Salem Cha-TeluguStop.com

ఇకపోతే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అన్ని వయస్సుల వారి పాలిట శాపంగా మారింది.ఇప్పటికే అన్ని రంగాల వారిని ముప్పతిప్పలు పెడుతున్న కరోనా వల్ల ఎందరో ప్రముఖులు బలి అవుతున్నారు.

కాగా తాజాగా కరోనా బారినపడిన ప్రముఖ నిర్మాత సేలం చంద్రశేఖర్‌(59) సోమవారం కరోనాతో కన్నుమూశారు.ఇదిలా ఉండగా 2005 సెప్టంబర్ నెలలో సూర్య నటించిన గజినీ అనే చిత్రం ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో అందరికి తెలిసిందే.

ఈ చిత్రాన్ని నిర్మించింది సేలం చంద్రశేఖర్‌.ఇదే కాకుండా విజయకాంత్‌ నటించిన ‘శబరి’, భరత్‌ నటించిన ఫిబ్రవరి 14, కిల్లాడి వంటి సినిమాలను కూడా నిర్మించారు.ఇకపోతే సేలం చంద్రశేఖర్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube