గత సంవత్సరం కంటే ఈ 2021 వ సంవత్సరం మాత్రం భయంకరమైన అనుభవాలను ప్రజల మనస్సుల్లో చిత్రీకరిస్తుంది.ఈ సంవత్సరం ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజలు విపరీతంగా మరణిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ కరోనా ఎందరో ప్రతిభావంతులను తన పొట్టన పెట్టు కుంటుండగా ఇతర అనారోగ్యాల కారణంగా కూడా మరి కొందరు మరణిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ హిప్నాటిస్ట్, సైకాలజిస్ట్ డా.హిప్నో కమలాకర్ గుండె పోటుతో మృతి చెందినట్లుగా సమాచారం.
కాగా రెండు రాష్ట్రాల్లో కూడా హిప్నాటిజం, సైకాలజీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న కమలాకర్ వయస్సు 53 సంవత్సరాలు.
ఇక స్వల్ప అనారోగ్యం కారణంగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి పది గంటలకు అకస్మాత్తుగా గుండె పోటు రావడం తో మృతి చెందారట.ఇకపోతే కమలాకర్ భార్య పద్మ కూడా సైకాలజీ రంగంలో రాష్ట్రపతి అవార్డు సాధించారు.