చిత్రపరిశ్రమ వరుస మరణాలతో విషాదం లో కూరుకు పోతుంది.ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రాణాలు తీసుకున్న గత సంవత్సరం విషాదం మరవక ముందే ఈ కొత్త సంవత్సరం కూడా తానేమి తక్కువ తినలేదని విజృంభిస్తుంది.
ఇకపోతే తాజాగా తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన దర్శకుడు కేవీ ఆనంద్ ఈ రోజు తెల్లవారు ఝామున హార్ట్ ఎటాక్తో కన్నుమూశారు.ఇక తెలుగులో ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కేవీ ఆనంద్, తమిళంలో కూడా మోహన్ లాల్, సూర్య, ధనుష్, తమన్నా, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.
కాగా ఇతని దర్శకత్వంలో వచ్చిన రంగం, అయాన్, తెలుగులో వీడొక్కడే చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచిన విషయం తెలిసిందే.దర్శకుడు ఆనంద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు.
ఆయన మృతికి తమ సంతాపం తెలియజేస్తున్నారు.