ఒకపక్క జరిగిన పంచాయతీ ఎన్నికలలో దాదాపు 80 శాతం జగన్ పార్టీ గెలవడంతో రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు ఫుల్లు సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి.ఇదే క్రమంలో జాతీయ మీడియా కూడా 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఎలాంటి ఆదరణ ఉందో అలాంటి ఆదరణ ఇంకా జగన్ కి ఏపీలో ఉంది అని మరోసారి పంచాయతీ ఎన్నికలలో రుజువైన ట్లు కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో ప్రముఖ సంస్థ స్కోచ్.దేశవ్యాప్తంగా సర్వే చేసి ది బెస్ట్ సీఎం అవార్డును తాజాగా సీఎం జగన్ కి ప్రకటించడం జరిగింది. దాదాపు ఏడాది పరిపాలనను ఆధారం చేసుకుని దేశం మొత్తం సర్వే చేయగా జగన్ కి అవార్డు వచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ నేపథ్యంలో స్కోచ్ గ్రూపు ఛైర్మన్ సమీర్ కొచ్చర్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ కి అవార్డును అందజేశారు.
ఈ పరిణామంతో గ్రామం నుండి దేశం వరకు జగన్ క్రేజ్ మామూలుగా లేదని తాజా వార్త పై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.