వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వర్ధంతి ని పురస్కరించుకుని ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ ఆత్మీయుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన నాయకులందరికీ వైయస్ విజయలక్ష్మి నుంచి ఆహ్వానాలు అందాయి.
ఇందులో వైసిపి , టిడిపి కాంగ్రెస్, టిఆర్ఎస్ బిజెపి ఇలా అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులుగా ఉన్న వైయస్ సన్నిహితులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ సమావేశానికి తప్పకుండా అందరూ హాజరు కావాలని విజయలక్ష్మి పిలుపునిచ్చారు.
అయితే ఈ సభకు ఏపీ సీఎం జగన్ హాజరు కావడం లేదు. కేవలం షర్మిల మాత్రమే హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ సభకు హాజరయ్యే విషయం లో అందరూ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం విజయలక్ష్మి షర్మిల స్థాపించిన పార్టీ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆ పార్టీ ఆవిర్భావ సభ లోనూ ఆమె తన ప్రసంగం వినిపించారు.ఇదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది .ప్రస్తుతం వైసీపీలో మంత్రులుగా ఉన్న కొంత మంది వైఎస్ సన్నిహితులతో పాటు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది నాయకులు, అలాగే టిడిపి ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న వైఎస్ వీర విధేయులు ఇలా చాలా మంది ఈ సభకు హాజరయ్యే విషయంలో టెన్షన్ పడుతున్నారు.రాజకీయాలకు అతీతంగా ఈ సభను నిర్వహిస్తున్న, ఆ ప్రభావం ఖచ్చితంగా తమ పైన తమ పార్టీ పైన ఆ ప్రభావం పడుతుంది అనే టెన్షన్ నాయకుల్లో నెలకొంది.
ఇటీవల కాలంలో తెలంగాణ , ఆంధ్ర జల వివాదం ఏర్పడిన క్రమం లో రాజశేఖర్ రెడ్డి పైన అనేక మంది నాయకులు విమర్శలు చేశారు.రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడిగా పోలుస్తూ అనేక మంది కామెంట్ చేశారు.ఈ క్రమంలో ఈ సభకు వెళ్లడం ద్వారా అనవసర రాజకీయ తలనొప్పులను ఎదుర్కోవాలి అనే టెన్షన్ ఆహ్వానాలు అందుకున్న నేతల్లో ఉంది.ఈ క్రమంలోనే ఈ సభకు వెళ్లాలా వద్దా అనే విషయం లో నాయకులు టెన్షన్ పడుతున్నారట.
ఈ సభకు హాజరైన తమకు పెద్దగా కలిసి వచ్చేది ఉండదు అని, పైగా అనవసర రాజకీయ తలనొప్పులు ఎదుర్కోవాలి అనే కంగారు అందరిలోనూ కనిపిస్తోంది.