కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతబడటంతో ప్రస్తుతం సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొంది.కరోనా ప్రభావం ఎక్కువగానే ఉండటం ఎప్పటికి థియేటర్లు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి.
ఈ నేపధ్యంలో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ ఒటీటీ బాట పడుతున్నారు.ఇక దీనికి తగ్గట్లే ప్రస్తుతం కరోనా సిచువేషన్ ని ఒటీటీ సంస్థలు కూడా క్యాష్ చేసుకుంటున్నారు.
ఇక నిర్మాతలకి కూడా పెట్టిన బడ్జెట్ కంటే రెట్టింపు సొమ్ములు రైట్స్ రూపంలో ఒటీటీ సంస్థలు చెల్లించడంతో ఆన్ లైన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే హిందీలో పెద్ద సినిమాలు అన్ని కూడా ఒటీటీలో రిలీజ్ అయ్యాయి.
ఆన్ లైన్ లో ప్రేక్షకుల నుంచి కూడా భాగానే సినిమాలకి స్పందన వస్తుంది.ఇక అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ సినిమా కూడా ఒటీటీలో రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది.
ఇక ఈ సినిమా కోసం డిస్నీ హాట్ స్టార్ అత్యధిక మొత్తం రైట్స్ రూపంలో ఇవ్వడానికి ముందుకొచ్చింది.కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ద్వారా స్ట్రీమింగ్ అవనుంది.
ఈ సినిమాని డిస్నీ హాట్ స్టార్ 125కోట్లు పెట్టి కొనుక్కుందని టాక్ వినిపిస్తుంది.ఇప్పటి వరకూ ఓటీటీలో అమ్ముడైన సినిమాలన్నింటిలోకి ఇదే అత్యధికం అని చెబుతున్నారు.అయితే అక్షయ్ కుమార్ ప్రస్తుత మార్కెట్ బట్టి చూస్తే థియేటర్లో రిలీజ్ అయితే సినిమాకి కచ్చితంగా మూడు వందల కోట్లు వరకు కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించిన హాట్ స్టార్ కి ఎంత కలెక్షన్ వస్తుందో చూడాలి.