సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ… జూ.ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను చెప్పడం వల్లే సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని చేరదీశాడని చెప్పుకొచ్చింది.ఎంతైనా మన మనవడే కదా, హరిక్రిష్ణ కొడుకే కదా అని తాను అనడం వల్లనే ఎన్టీఆర్ తన మనవడైన జా.ఎన్టీఆర్ను పిలిపించి మాట్లాడాడు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఆ సమయంలో జూ.ఎన్టీఆర్ తనకు ఎన్టీఆర్కు మధ్యలో నిల్చొని ఫొటో దిగాడని చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్ను తానే పరిచయం చేశానని చెప్పిన లక్ష్మి పార్వతి ఆ తర్వాత మా పార్టీ అధికారం కూలిపోయాక ఎన్టీఆర్ నా ఫొటోను తీసేసి కేవలం తన తాతగారితో ఉన్న ఫొటోను మాత్రమే ఉంచుకున్నాడు.జూ.ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబానికి చెందిన వాడు కాబట్టే నన్ను దూరం పెట్టాడు.ఆ సమయంలో నేను జూ.ఎన్టీఆర్కు చాలా సాయం చేశాను.ఎన్టీఆర్ను నేనే అరంగేట్రం చేయించాను.నావల్లే ఈ లైఫ్ ఉంది అంటూ లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్ ఒకవేళ తెదేపాలోకి ప్రత్యక్షంగా దిగితే మీ సపోర్ట్ ఉంటుందా అని ప్రశ్నించగా నా మనవడికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చింది.నేను లిఫ్ట్ ఇవ్వడం వల్లనే ఎన్టీఆర్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని, ఎన్టీఆర్ కూడా తనను దూరం పెట్టడం చాలా బాధ అనిపించింది అంటూ లక్ష్మి పార్వతి వాపోయింది.