టిడిపి అధినేత పై వైసిపి నాయకురాలు తెలుగు అకాడమి చైర్మెన్ లక్ష్మి పార్వతి తన మాటలతో తూటాలు కురిపించారు.చంద్రబాబు ఒక అవినీతి పరుడు సొంత మామకే వెన్ను పోటు పొడిచారు.
ఇప్పుడు అమరావతి ప్రజలను కూడా తన మాయ మాటలతో వెన్ను పోటు పొడుస్తున్నారు.అలాంటి అవినీతిపరుడి మాటలు విని మోసపోవద్దు అన్నారు.
అలాగే వైజాగ్ లో చంద్రబాబు చేస్తున్నది ప్రజాచైతన్య యాత్ర కాదని అందుకే అక్కడి ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారు.
అందుకే అక్కడి ప్రజలు బాబు పైన చెప్పులు వేస్తున్నారు.
అలాంటి అవినీతి పరుడు మోసగాడిని ఉత్తరంద్ర ప్రజలు చెప్పులు వేసి బాగా బుద్ది చెప్పారు అన్నారు.విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు.
వైసిపి ఎంపి నందిగం సురేష్ పై అన్యాయం గా చంద్రబాబు తన అనుచరులతో దాడి చేయించాడని లక్ష్మి పార్వతి అన్నారు.