హరికృష్ణ, బాలయ్యలపై లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌గా పదవి బాధ్యతలు తీసుకున్న లక్ష్మీ పార్వతి వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఆమె ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

 Laxmi Parvathi Comments On Hari Krishna Balakrishna-TeluguStop.com

ఆమె ఇటీవల సాక్షి ఛానెల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయంగా హరికృష్ణ మరియు బాలకృష్ణలను వాడుకుంటున్నాడు అంటూ ఆరోపించాడు.ఆయన తన రాజకీయాల్లో పబం గడుపుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆరోపించింది.

హరికృష్ణ మరియు బాలకృష్ణలు కల్మషం లేని వ్యక్తులు.వారిద్దరిలో ఒకరిని సీఎంగా మరొకరిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తానంటూ నమ్మించి వైస్రాయ్‌ హోటల్‌కు తీసుకు వెళ్లాడంటూ లక్ష్మీ పార్వతి ఆరోపించింది.

వారిద్దరిని నమ్మించి వాడుకుని మోసం చేశాడంటూ చంద్రబాబు నాయుడుపై ఆమె విమర్శలు గుప్పించింది.హరికృష్ణ, బాలకృష్ణలతో పాటు సుహాసిని, ఎన్టీఆర్‌లను కూడా చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశాడంటూ ఆమె ఆరోపించింది.

చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబంను సర్వ నాశనం చేసిన ఒక పురుగు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube