బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో కు ఉండే క్రేజే వేరు.చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు.
ఈ షో ద్వారా ఫేమ్ సంపాదించి అవకాశాలు సంపాదించుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు.తెలుగు.
తమిళం, హిందీ, కన్నడ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది.సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో, వాళ్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలిపే షో కావడంతో ఈ షోకు ఇంత క్రేజ్ ఉంది. అయితే ఈ షో గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.తాజాగా ప్రముఖ నటి లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
త్వరలో తమిళ బిగ్ బాస్ షో ప్రారంభం కానుండటంతో లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారంటూ ప్రచారం జరిగింది.దీంతో లక్ష్మీ మీనన్ తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టతనివ్వడంతో పాటు బిగ్ బాస్ పనికిమాలిన షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీ మీనన్ కథ, సినిమాలోని పాత్ర నచ్చితేనే సినిమాలో నటిస్తుందనే పేరు ఉంది.ఆమె బిగ్ బాస్ షో కెమెరా ముందు ఫేమస్ కావడానికి పాల్గొనే షిట్ షో అని.ప్లేట్లు కడగాలని, ఇతరుల మరుగుదొడ్లు కడగాలని తాను అనుకోలేదని.అంత దుస్థితి తనకు పట్టలేదని చెప్పుకొచ్చింది.
వేదాళం సినిమాలో అజిత్ సోదరి పాత్రతో లక్ష్మీ మీనన్కు మంచి గుర్తింపు వచ్చింది.
బిగ్ బాస్ షో గురించి లక్ష్మీ మీనన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.
కొందరు లక్ష్మీమీనన్ చెప్పింది కరెక్ట్ అని చెబుతుంటే మరి కొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.