బ్రతికుండగానే ముక్కలు చేశారు!!!

దుర్మార్గుల దురాగతానికి మరో అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన యావత్ ప్రపంచాన్నే గగుర్పొడిచేలా చేసింది…వివరాల్ళోకి వెళితే…20ఏళ్ల గౌరీ శ్రీవాస్తవ అనే అమ్మాయి న్యాయ శాస్త్రం విధ్యార్థిని.

 Law Student Murdered By Chopping Her Body Into Pieces-TeluguStop.com

అయితే ఆమె గత ఆదివారం అపహరణకు గురి అయ్యింది అని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించగా.వారు చాలా నీచంగా మాట్లాడి.

ఆయన్ని బయటకు గెంటివేసారు.ఇక దీనిపై దర్యాప్తు జరుగుతున్న పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది.

అదేమిటంటే.బతికుండగానే చిత్రహింసలు పెడుతూ కరెంట్ రంపంతో ఆమె కాళ్లు, చేతులు, వేళ్లు, తల ఇలా ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఓ జంతు వధశాలలో ముక్కలుముక్కలుగా ఆమెను నరికి వేశారు కొందరు దుర్మర్గులు.

ఆమె దేహ ఖండాలను దుర్మార్గులు ఓ బస్తాలో మూటగట్టి పడేశారు.దొరికిన ఆమె మృతదేహం భాగాలకు పోస్ట్‌మార్టం నిర్విహించిన వైద్యులు రేప్‌ను మాత్రం నిర్ధారించలేదు.

అయితే ఓ జంక్షన్‌ వద్ద ఉన్న సీసీటీవీలో ఆమె ఎవరో యువకుడితో మాట్లాడిన సంభాషణలను పోలీసులు ఛేదిస్తున్నారు.ఆ యువకుడు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

అంతేగాకుండా ఆమె ఫేస్‌బుక్‌ స్నేహితులనూ విచారిస్తున్నారు.నలుగురు వ్యక్తులను అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇందుకు ప్రేమవ్యవహారం కారణమై ఉండవచ్చునని వారు భావిస్తున్నారు.ఏది ఏమైనా మానవ క్రూరత్వానికి మరో అమ్మాయి ఆహుతై పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube