నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్ల మీద వెంకయ్య స్పందించారు.
ప్రభుత్వం, బీజేపీ నాయకులు తనను రాజకీయ పరికరంగా వాడుకుంటున్నారని వాద్రా అన్నారు.తానూ అందరి మాదిరిగానే వ్యాపారం చేసుకుంటున్నానని, కానీ తనను బీజేపీ నాయకులు వేధిస్తున్నారని వాద్రా అన్నారు.
దీనిపై వెంకయ్య మాట్లాడుతూ తాము ఎవ్వరినీ వేధించడం లేదన్నారు.చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
గత ప్రభుత్వాలు వాద్రాకు చట్ట విరుద్ధంగా భూములు కేటాయించినట్లు వచ్చిన ఆరోపణల మీద హర్యానా ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.అక్రమాలు జరిగినట్లు కమీషన్ నివేదిక ఇస్తే వాద్రాపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని వెంకయ్య చెప్పారు.