అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఒకవైపు యంగ్ హీరోల సినిమాల్లో మరోవైపు సీనియర్ హీరోల సినిమాల్లో కూడా నటించారు.ఈ ఏడాది లావణ్య త్రిపాఠి నటించిన రెండు సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో రిలీజ్ కాగా ఆ రెండు సినిమాల ఫలితాలు లావణ్య త్రిపాఠికి భారీ షాకిఛ్చాయి.
ప్రస్తుతం కొత్త కథలు వింటున్న ఈ బ్యూటీ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
తనకు ట్రిపోఫోభియా ఉందని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.
కొన్ని ఆకారాలను, వస్తువులను చూసిన వెంటనే తనలో భయం మొదలవుతుందని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.చాలా రోజుల నుంచి ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నానని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.
ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ బ్యూటీ ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.
తనకు ఒక కథ నచ్చిందని త్వరలోనే కెమెరా ముందుకు వస్తానని లావణ్య త్రిపాఠి వెల్లడించారు.
ఇతరులలో ఉండే మంచి లక్షణాలను తాను గ్రహిస్తానని లావణ్య త్రిపాఠి కామెంట్లు చేశారు.ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఇతరుల నుంచి తాను స్పూర్తిని పొందుతానని ఆమె పేర్కొన్నారు.రెండు సినిమాలు రిలీజైన తర్వాత కెరీర్ విషయంలో కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకున్నానని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.
లైఫ్ లో సంతోషంగా లేని టైమ్ లో ఇతరులకు ఆనందాన్ని పంచడం సాధ్యం కాదని ఆమె కామెంట్లు చేశారు.ఆ సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తరచి చూసుకోవడం ముఖ్యమేనని లావణ్య త్రిపాఠి కామెంట్లు చేశారు.లావణ్య త్రిపాఠి ట్రిపోఫోబియాతో బాధ పడుతున్నారని తెలిసి ఆమె అభిమానులు సైతం అవాక్కయ్యారు.
లావణ్య త్రిపాఠి కెరీర్ లో సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు.