తెలుగులో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రస్తుతం బంగార్రాజు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా రమ్య కృష్ణ నటిస్తోంది.
అలాగే ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రం స్క్రిప్టు పనులు పూర్తయి ఇప్పటికే దాదాపుగా రెండేళ్లు కావస్తున్నప్పటికీ సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు.
దీనికితోడు గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టించడంతో కొంత కాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.
దీంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తొందర్లోనే మళ్ళీ మొదలు పెట్టాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సన్నాహాలు చేస్తున్నాడట.అయితే ఇప్పటికే ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్య కృష్ణ కన్ఫర్మ్ అయినప్పటికీ నాగ చైతన్య కి జోడి ఎవరనే విషయంపై మాత్రం కొంతమేర సందిగ్ధత నెలకొన్నది.కాగా ఆమధ్య దర్శకుడు నాగ చైతన్యకి జోడీగా అందాల రాక్షసి చిత్రం ఫిలిం లావణ్య త్రిపాఠి ని నటింపజేయాలని అనుకున్నాడట.
కానీ అనివార్య కారణాలవల్ల ఆమెను ఈ చిత్రం నుంచి తప్పించినట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాక లావణ్య త్రిపాఠి స్థానంలో సమంత అక్కినేని ని తీసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.
కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను జూన్ నెలలో మొదలు పెట్టాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సన్నాహాలు చేస్తున్నాడు.కానీ ఇటీవలే మరోమారు జూన్ ఆరో తారీకు వరకు లాక్ డౌన్ ను పొడగించారు.మరి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ షూటింగ్ పనుల ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.