ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కేవలం హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే కాకుండా ఫైటింగ్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకి మాత్రమే పరిమితం అయిపోకుండా తమని తాము ఎలివేట్ చేసుకునే విధంగా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ భామలు ఈ దారిలో తమ జర్నీ స్టార్ట్ చేశారు.హీరోయిన్స్ గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలనీ గా డిఫరెంట్ పాత్రలు చేస్తూ జర్నీ సాగిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సౌత్ భామలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు.స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకి స్వస్తి చెప్పి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంది.
అలాగే రీసెంట్ గా ది ఫ్యామిలి మెన్ వెబ్ సిరీస్ లో విలన్ గా కనిపించబోతుంది.ఇక రెజినా కాసాండ్రా కూడా చక్ర సినిమాలో విలనీగా నటించి మెప్పించింది.
ఈమె పాత్రకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఇక నటి వరలక్ష్మి కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రలలో మెప్పిస్తుంది.
ఇదే దారిలో వెళ్ళడానికి మరో బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా ప్రయత్నం చేస్తుంది.రీసెంట్ గా ఏ1 ఎక్స్ ప్రెస్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని మాటని బయటపెట్టింది.
రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయాలనే ఆలోచన పెట్టుకోకుండా కొత్తదనం ఉన్న పాత్రలు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపింది.ప్రత్యేకంగా విలనీ పాత్రలు చేస్తున్నప్పుడు మనలోని టాలెంట్ బయటకి వస్తుందని చెప్పుకొచ్చింది.
ఇక నెగిటివ్ రోల్స్ చేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని అలాంటి పాత్రలతో ఓ రెండు సినిమాలు కమిట్ అయ్యానని త్వరలో వాటికి సంబందించిన వివరాలు తెలుస్తాయని చెప్పుకొచ్చింది.