యంగ్ హీరో రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా విభిన్న కథలని ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం అతని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ సీక్వెల్ తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆసక్తిని పెంచింది.ఇదిలా ఉంటే నిఖిల్ ఇప్పటికే మరో సినిమాకి కూడా ఒకే చెప్పాడు.
సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయన అందించిన కథతో 18 పేజెస్ టైటిల్ తో తెరకెక్కే ప్రేమకథా చిత్రంలో నిఖిల్ హీరోగా ఒకే అయ్యాడు.దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఎప్పుడో వచ్చింది.
ఈ సినిమాకి కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తుంది.
ఇందులో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
నిఖిల్, లావణ్య కాంబినేషన్ లో ఇప్పటికే అర్జున్ సురవరం సినిమా వచ్చింది.ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు, వీరి కాంబినేషన్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.
ఈ నేపధ్యంలో 18 పేజెస్ కోసం చాలా మంది హీరోయిన్స్ ని చూసిన తర్వాత ఫైనల్ గా సుకుమార్ టీమ్ లావణ్య త్రిపాఠికి ఓటు వేసినట్లు తెలుస్తుంది.దీనిపై త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని సమాచారం.
అర్జున్ సురవరంతో హిట్ కొట్టిన ఈ జోడీ మళ్ళీ 18 పేజెస్ కోసం జోడీ కడితే సినిమాకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది.మరి తాజాగా వినిపిస్తున్న వార్తలలో నిజమెంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే.