ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపొయింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇంటికే పరిమితం అయినా జనం ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ని ఆశ్రయిస్తూ వచ్చారు.
దీంతో ఓటీటీ ఛానల్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగింది.ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ ఛానల్స్ కూడా వెబ్ సిరీస్ లపై ధృష్టి పెట్టాయి.
స్టార్ క్యాస్టింగ్ ని పెట్టి వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తున్నాయి.ఓటీటీలో రెమ్యునరేషన్ కూడా బాగుండటంతో అందాల భామలు అటుగా అడుగులు వేస్తున్నారు.
సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లు చేసేందుకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే ఈ దారిలోకి ప్రియమణి, సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి సౌత్ భామలు అందరూ వచ్చేశారు.
ఇప్పుడు ఈ దారిలోకి మరో బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా రాబోతుంది.
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ భామకి కెరియర్ లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు మారుతి అందించిన కథతోనే ఈమె వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది.సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వెబ్ సిరీస్లో ప్రస్తావిస్తారని టాక్.ఇందులో లావణ్య పాత్ర చాలా పవర్ఫుల్ ఇండిపెండెంట్ విమెన్ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన మారుతి వెబ్ సిరీస్ ల విషయంలో మాత్రం ఈ జోనర్ ని ఫాలో అవ్వకుండా కంటెంట్ బేస్ కథలు సిద్ధం సిద్ధం చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ ఆహాలో టెలికాస్ట్ అవుతుందని తెలుస్తుంది.