టాలీవుడ్లో సొట్ట బుగ్గల చిన్నదిగా గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి, తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు క్రేజ్ను దక్కించుకున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా ఓ అరుదైన ఫీట్ను సాధించింది.
ఇన్స్టాగ్రామ్లో అమ్మడు ఏకంగా 2 మిలియన్ మంది ఫాలోవర్లను సొంతం చేసుకుని దూసుకుపోతుంది.లేటెస్ట్ అప్డేట్లతో పాటు తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న ఈ బ్యూటీ, తనను ఫాలో అవుతున్న తన అభిమానులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల పరంగా ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా’ అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది.ఈ రెండు చిత్రాలు తన కెరీర్కు మరింత ప్లస్ అవుతాయని లావణ్య ధృడంగా భావిస్తోంది.
ఈ సినిమాలో తనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కిందని అమ్మడు అంటోంది.ఇక ఈ సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని ఆయా చిత్ర యూనిట్లు అంటున్నాయి.
ఈ క్రమంలో అమ్మడు 2 మిలియన్ ఫాలోవర్ల ఫీట్ను సాధించడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక ఈ బ్యూటీ రాబోయే సినిమాల్లో మరింత మంచి పేరును తెచ్చుకోవాలని, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మరింత తారాస్థాయికి చేరుకోవాలని ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఏదేమైనా చాలా తక్కువమందికి సాధ్యమయ్యే ఫీట్ను లావణ్య అందుకోవడం నిజంగానే విశేషమని చెప్పాలి.మరి ఈ సొట్టబుగ్గల చిన్నది మున్ముందు ఎలాంటి పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తుందో కాలమే తెలియజేస్తుంది.