యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినా విషయం తెలిసిందే.బాహుబలి హిట్ తో బాలీవుడ్ లో కూడా ప్రభాస్ పేరు మోత మోగిపోయింది.
ఈ సినిమా తర్వాత చేసిన సాహో సినిమా తెలుగులో అంత హిట్ అవ్వకపోయిన బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.దీంతో ప్రభాస్ స్టార్ డమ్ ఎంత రేంజ్ లో పెరిగిందో యిట్టె తెలిసి పోతుంది.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఆ లిస్టులో ఆదిపురుష్ సినిమా కూడా ఉంది.ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల బడ్జెట్ తో భారీ విజువల్ గ్రాఫిక్స్ తో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 35 శాతం పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ షూట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమా షూట్ లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నాడు.ప్రభాస్ కృతి సనన్ మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.అంతేకాదు ఇప్పటికే 65 రోజుల మేర టాకీ పార్ట్ షూట్ పూర్తి అయ్యిందని సమాచారం.
అలాగే ఈ సినిమా షూట్ మొత్తం ఈ సంవత్సరమే పూర్తి చేయాలనీ డైరెక్టర్ ఓం రౌత్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.షూట్ పూర్తి అయితే ఆ తర్వాత విజువల్ వర్క్ పనులు చాలా సమయం పడుతుంది కాబట్టి జనవరి నుండి మొదలు పెడితే ఆగస్టు నాటికీ పూర్తి చెయ్యవచ్చని అప్పుడు ముందుగా ప్రకటించిన డేట్ కే విడుదల చేయవచ్చని భావిస్తున్నాడట.మరి వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు పూర్తి చేస్తారో లేదో చూడాలి.