టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని నెలల క్రితం జస్ట్ స్టోరీ లైన్ వినిపించిన దర్శకుడు బన్నీ నిర్ణయం తీసుకున్నాడు.
ఇన్నాళ్లు స్టోరీ లైన్ తో బన్నీ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారు చేశాడు.
రీసెంట్ గా బౌండ్ స్క్రిప్ట్ ను విన్న అల్లు అర్జున్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మొదట్లో బన్నీకి చెప్పిన కథ అంతకుముందు మహేష్ కు చెప్పినట్లు టాక్ వచ్చింది.కానీ సుక్కు ఆ స్క్రిప్ట్ ను పక్కనపెట్టి బన్నీ కోసం స్పెషల్ గా మరో కథను సెట్ చేసుకున్నాడు.
మహేష్ కూడా మొదట నచ్చినట్లు చెప్పినప్పటికీ ఆ తరువాత ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాక స్క్రీన్ ప్లే నచ్చక ఒప్పుకోలేదట.
కానీ బన్నీ మాత్రం సుకుమార్ మీద నమ్మకంతో మరొసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆర్య – ఆర్య 2 సినిమాలతో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ కాంబో మూడవసారి మాత్రం డిఫరెంట్ యాక్షన్ అండ్ ట్విస్టులతో ఎట్రాక్ట్ చేయనుందట.రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ ప్రాజెక్టును కూడా నిర్మించనున్నారు.
అక్టోబర్ లో సినిమా స్టార్ట్ కానున్నట్లు సమాచారం.