తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ తాజాగా కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 116 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో భారీగానే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుండి 165 మంది కోలుకోవటం జరిగింది.కొత్తగా నమోదైన కేసులు పెట్టి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,923 కు చేరుకోగా.2,95,387 మంది రికవరీ అయ్యారు.ఇక, ఇప్పటి వరకు 1,634 మంది మృతిచెందారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే 1,902.వీరిలో కొంతమంది హాస్పిటల్లో మరికొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.ఇదిలావుంటే ఇటీవల హైకోర్టు హెల్త్ బులిటెన్ విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో.గత కొన్ని రోజుల నుండి వరుసగా తెలంగాణ సర్కార్ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ ఉంది.
ముఖ్యంగా తెలంగాణా పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక వంటి చోట్ల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు.రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది.