చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రముఖ కార్ల తయారి సంస్థ కియా ఏపీలో ప్లాంట్ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.ఇప్పటికే అక్కడి నుండి కార్ల తయారి ప్రారంభం అయ్యింది.
ఈ సమయంలో ఏపీలో ఉన్న పరిస్థితుల కారణంగా కియా కార్ల కంపెనీ అక్కడ నుండి తమిళనాడుకు షిఫ్ట్ కాబోతున్నట్లుగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థలో కథనం వచ్చింది.కియా కారు ఉత్పాదకాలు బాగానే ఉన్న స్థానిక పరిస్థుతులు కంపెనీపై ప్రభావం చూపుతున్నాయంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.
కియా ప్లాంట్ తరలింపుపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు.అదో చెత్త ఊహాగాణపు వార్త అంటూ కొట్టి పారేశాడు.తమకు అలాంటి ఉద్దేశ్యం లేదన్నాడు.110 కోట్ల డాలర్ల విలువైన ఈ ప్లాంట్ను మార్చే ఆలోచన తమకు లేదంటూ పేర్కొన్నాడు.అలాంటి ఊహాగాణలు రాసేప్పుడు కాస్త ఆలోచించాలని, అదే సమయంలో సంప్రదించాలంటూ ఆయన పేర్కొన్నారు.ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుండి కూడా ఆ కథనంపై స్పందన వచ్చింది.
కియా తరలింపు అంటూ వచ్చిన వార్త నిజం కాదని ఏపీలో కియా ప్లాంట్కు అవసరం అయిన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందంటూ ప్రభుత్వం తరపున అధికారి స్పందించారు.