పవన్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న జార్జిరెడ్డి చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఇన్ని రోజుల వరకు ఎలాంటి వివాదాలు లేవు.
విడుదలకు ఇంకా వారం కూడా లేని సమయంలో ఈ సినిమాను నిషేదించాల్సిందే అంటూ ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులను రౌడీలుగా చూపించడంతో పాటు విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆందోళన చేస్తున్నారు.
జార్జిరెడ్డి హత్యలో ఏబీవీపీ విద్యార్థి నాయకుల హస్తం లేదని గతంలోనే కోర్టు తేల్చింది.కాని మళ్లీ ఆ విషయాన్ని ఈ సినిమాలో చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఏబీవీపీ నాయకులు అంటున్నారు.
సినిమాలో జార్జిరెడ్డి గురించి గొప్పగానే చెపుతున్నారు తప్ప ఆయనపై 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి.వాటిని చూపిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఉన్న వాస్తవాలు చూపించకుండా కల్పితాలను చూపిస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే ఈ సినిమాను నిషేదించాలని.ఒకవేళ విడుదల చేయాలని చూసినా అడ్డుకుంటాం అంటూ ఏబీవీపీ కార్యకర్తలు అంటున్నారు.
ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందా అంటూ యూనిట్ సభ్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.