టైం బ్యాడ్ అయితే దూది కూడా గునపంగా మారిపోతుంది అంటారు.ఇప్పుడు అలాంటి ఘటనే ఓ ఎన్నారై విషయంలో రుజువయ్యింది.
ఓ భారత ఎన్నారై కి ఎదురైన ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేను అంటూ ఆ చేదు జ్ఞాపకాన్ని తలుచుకుని తెగ బాధపడిపోతున్నాడు.ఇంతకీ ఆ ఎన్నారై అంతగా బాధపడిపోవడానికి గల కారణం ఏమిటో తెలుస్తే మీరు షాక్ అవ్వడమే కాకుండా అతడిపై సానుభూతి చూపిస్తారు కూడా…ఆ వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉంటున్న కునాల్ కమ్రా అనే భారత సంతతి ఇండో అమెరికన్ కొద్ది రోజుల క్రితం తన కుటుంభ సభ్యులని చూడటానికి ఇండియా వచ్చాడు.ఈ క్రమంలో అతడు ముంబై వెళ్లడానికి జైపూర్ లో ఉన్న విమానాస్రయానికి చేరుకున్నాడు.అయితే అక్కడి భద్రతా సిబ్బంది కునాల్ ని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు.కునాల్ ఎందుకు ఎక్కడ కూడదని వారించగా….
మీరు బ్లాక్ లిస్టు లో ఉన్నారని, మీరు విమానం ఎక్కడానికి రూల్స్ లేవని చెప్పడంతో షాక్ అయ్యాడు కునాల్.కునాల్ కమ్రా అనే వ్యక్తిని నేను కాదని, మరో సారి చెక్ చేసుకోవాలని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదు.దాంతో అతడు వాదానికి దిగాడు, ఈ నేపధ్యంలో అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన అధికారులు బ్లాక్ లిస్టు లో పెట్టింది ఇతడిని కాదని తెలుసుకుని అతడిని విడుదల చేశారు.ఓ ప్రముఖ మీడియా సంస్థ వ్యాఖ్యతతో కునాల్ కమ్రా అనే వ్యక్తి వాగ్వాదానికి దిగాడని అందుకే ఆ పేరుని బ్లాక్ లిస్టు లో పెట్టారని అదే పేరుతో మరో వ్యక్తి ఉండటం వలనే సిబ్బంది పొరబడ్డారని అధికారులు తెలిపారు.
.