ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించి నటువంటి చిత్రం దర్బార్.
ఈ చిత్రంలో హీరోగా తమిళ తలైవా రజినీకాంత్ నటించగా రజినీ కి జోడీగా గ్లామర్ క్వీన్ నయనతార నటించింది.అలాగే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నివేతా థామస్, ప్రతీక్ బబ్బర్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 9వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలయింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం రజినీకాంత్ అంచనాలకు తగ్గట్టుగానే దూసుకు పోతోంది.ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే దాదాపుగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.
అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక్క సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి ఇమేజ్ ఉంది.
అందుకే సౌత్ లో కూడా రజనీకాంత్ సుమారు 40 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించి ఔరా అనిపించాడు.ఇప్పటికే ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఫుల్లుగా అలరిస్తోంది.అయితే వీటి గురించి అధికారికంగా లెక్కలు ఇంకా వెలువడకున్నప్పటికీ ప్రస్తుతం థియేటర్లలో దర్బార్ క్రేజ్ ని చూసి సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఇందుకుగాను రజినీకాంత్ కి కలిసొచ్చే విషయం ఏంటంటే ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమాకి పోటీ ఇచ్చే చిత్రాలు లేకపోవడంతో వసూళ్లు మరింత పెరిగాయి.