సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టువంటి మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం పని చేయాలని ఎంతోమంది దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, నటీనటులు ఆరాటపడుతుంటారు.ఈ విధంగా అతను సినిమా కోసం పని చేయాలని భావించే వారికి అలాంటి అవకాశం వస్తే వారి సంతోషం మాటలలో చెప్పలేము.
ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్.
మలయాళ సూపర్ హిట్ చిత్రమైన”లూసీఫర్“చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా “#Chiru153” అని వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా సమాచారాన్ని సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ తెలియజేశారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నటువంటి తమన్ ఇప్పటికే ఈ చిత్రంలో ఒక పాట రికార్డింగ్ పూర్తిచేశామని, చిరంజీవి గారు స్వయంగా చెప్పిన విషెస్ తో కూడిన పాటను రికార్డింగ్ చేశామని తెలిపారు.అదేవిధంగా చిరంజీవి అభిమానిగా తన జీవితంలో ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేనని, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజా గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.కాగా ఈ సినిమా ఆగస్టు 13 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తమన్ తెలియజేశారు.