తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించినటువంటి చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రంలో కథానాయకుడిగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించగా అతడి సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటించారు.
అలాగే ఈ చిత్రంలో జయరాం, టబు, సునీల్, సుశాంత్, మురళి శర్మ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన టువంటి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో దూసుకు పోతోంది.
ఇప్పటికే ఇతర దేశాల్లో బాహుబలి రికార్డు బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డులు వైపు దూసుకు పోతోంది.అంతేగాక ఇప్పటికే యూఎస్ దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన టువంటి టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా అల వైకుంఠ పురంలో చేరింది.
అయితే ఈ చిత్రం విడుదలై దాదాపు పది రోజులు కాఒస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు.తాజాగా కలెక్షన్ల సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదలైన 10 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లు కొల్లగొట్టినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలియజేశారు.
అయితే ఇందులో తెలుగు స్టేట్స్ లో మాత్రమే దాదాపుగా 113 కోట్లు రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.అంతేగాక శాండిల్వుడ్, కోలీవుడ్ మరియు ఇతర దేశాల్లో కలిపి మరో 143 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.దీంతో అబన్నీ ఆల్ టైమ్ రికార్డు వైపు కన్నేశాడు.అంతేగాక వారాంతం కూడా దగ్గరపడుతుండటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.ఏదేమైనప్పటికీ ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే ఓ మంచి మైలురాయిగా నిలిచిపోతుందని ఎటువంటి సందేహం లేదు.ఒక వైపు ఈ చిత్రానికి మహేష్ బాబు నటించినటువంటి సరి లేరు నీకెవ్వరు చిత్రం వసూళ్ల పరంగా గట్టి పోటీని ఇస్తోంది.