టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో సారి తనదైన శైలి లో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.గత సార్వత్రిక ఎన్నికల తరువాత నుంచి ఆయన చేసే ప్రతి ట్వీట్ కూడా సంచలనం సృష్టిస్తుంది.
ఒకసారి స్వపక్షం పై మరోసారి అధికార పక్షం పై వరుస ట్వీట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న నాని తాజా మరో ట్వీట్ చేశారు.అయితే ఈ సారి ట్వీట్ స్వపక్షం కోసమా ప్రతిపక్షం కోసమా అన్న విషయం కూడా అర్ధం కానీ రేంజ్ లో ఆయన ట్వీట్ ఉండడం విశేషం.ఈయన గారి తాజా ట్వీట్ లో ఏమని ఉందటే….”నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు.నాలుగు పదాలు చదవలేనివాడు,నాలుగు వాక్యాలు రాయలేనివాడు, ట్వీట్ చేస్తున్నాడు.దౌర్భాగ్యం” అంటూ ట్వీట్ చేశారు.అయితే ఇంతకీ ఈ ట్వీట్ అధికార పక్షం పై చేశారా,లేక స్వపక్షం లో ఉన్న బాబు గారి కుమారుడు నారా లోకేష్ పై ఇలా పరోక్షంగా విమర్శలు చేసారా అన్న విషయం అర్ధం కాక టీడీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు.ఎందుకంటే అనర్గళంగా నాలుగు పదాలు కంటిన్యూగా మాట్లాడడానికి లోకేష్ కష్టపడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే నాని చేసిన తాజా ట్వీట్ తో అసలు వైసీపీ పై ఆయన విమర్శలు చేసారా,లేక సొంత పార్టీ అధినేత కుమారుడి పై విమర్సలు చేసారా అన్న విషయం మాత్రం తెలియడం లేదు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దీంతో నెటిజన్లు మాత్రం పక్కా ఈ ట్విట్ ‘ట్విట్టర్ పిట్ట నారా లోకేష్’కే అంకితం అంటూ సెటైర్లు కూడా వేసేస్తున్నారు.మరి నారా లోకేష్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.