గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా మనకు సమంత నాగచైతన్య టాపిక్ కనిపించేది వినిపించేది సమంత నాగచైతన్య త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని, సమంతకు విడాకులు తరువాత కొన్ని కోట్లలో నాగచైతన్య భరణంగా ఇవ్వబోతున్నాడని, అక్టోబర్ 7వ తేదీ వీరి పెళ్లిరోజు కావడంతో అదే రోజున వీరు విడాకుల విషయం కూడా బయట పెట్టబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ఉన్నాయి.ఇలా వీరి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఈ జంట స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇక సోషల్ మీడియాలో తాజాగా వీరి గురించి మరో కథనం ట్రెండ్ అవుతోంది.
తాజాగా గత రెండు రోజుల క్రితం సమంత తన దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలన్ని రూమర్లేనని ఒక్కమాటతో అన్నింటికీ చెక్ పెట్టారు.తను ముంబైకి షిఫ్ట్ అవుతుంది అంటూ వార్తలు రావడం పూర్తిగా అవాస్తవమని, తనకు ఎంతో మంచి లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ ను వదిలి తను ఎక్కడికి వెళ్ళలేదు అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది.
మరి వీరి గురించి వస్తున్న విడాకుల విషయంలో కూడా నిజం లేదంటూ చెప్పకనే చెప్పేశారు.ఈ క్రమంలోనే విడాకులు విషయం రూమర్ అయితే సమంత ఎక్కడ కూడా అక్కినేని కుటుంబ వేడుకలలో కనిపించకపోవడంతో అభిమానులకు ఈ విషయం నమ్మశక్యంగా లేదని భావించారు.అయితే సమంత ప్రస్తుతం చెన్నైలో ఉండడానికి గల కారణం సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటిస్తున్న టువంటి కాదు వాకుల రెండు కాదల్ చిత్రం కోసం చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే సమంత నాగచైతన్య ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.త్వరలోనే వీరిద్దరూ అక్కినేని కుటుంబానికి వారసులను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని అందుకోసమే తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఇకపై తన భర్త ఒడిలో సేద తీరాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.అందుకోసమే ఆమె ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ కాకుండా సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇదే కనుక నిజమైతే అక్కినేని అభిమానులకు ఇంతకన్నా శుభవార్త ఉండదని చెప్పవచ్చు.