మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో ఆచార్య సినిమా ఒకటి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాను కొరటాల సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అభిమానులు పెద్ద అంచనాలనే పెట్టుకున్నారు.
ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే. రామ్ చరణ్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇప్పటికే ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్నట్టు మేకర్స్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.
ఆచార్య షూటింగ్ స్టార్ట్ అయినట్టు టాక్ వినిపిస్తుంది.ప్రెసెంట్ చిత్ర యూనిట్ ఈ రెండు పాటల్లో ఒక పాటను షూట్ చేస్తున్నారట.
ఆ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.హైదరాబాద్ చివర్లలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ పాట షూట్ జరుగుతుందని తెలుస్తుంది.
ఈ పాట షూట్ ఒక వారం రోజులపాటు జరగనుందట.ఇక మరొక పాట చరణ్ పూజా హెగ్డే మధ్య ఉంటుందట.ఈ పాట నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ చేసి ఈ నెలలోనే ఈ సినిమా పూర్తి చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారట.ఇక ఈ రెండు పాటలు పూర్తి అయితే సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయినట్టే.
ఇక ఈ క్రమంలో త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుందో వేచి చూడాలి.