దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ బాగా తెలుసు.అయితే టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు బాలీవుడ్ పై మనసు పారేసుకుని అనుకున్నదే తడువుగా బాలీవుడ్ కి మకాం మార్చింది.
అయితే అక్కడ అడపాదడపా అవకాశాలు వచ్చినా సరైన హిట్ లేక సతమతమయ్యింది. ఐతే మళ్లీ ఏమైందో ఏమో కానీ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.
ఈ చిత్రం కూడా నిరాశ పర్చడంతో ప్రస్తుతం అవకాశాలు లేక అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
అయితే తాజాగా ఈ అమ్మడుకి సంబందించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె గతంలో టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర హీరోతో నటించింది.అయితే ఆ సయమంలో హీరోతో సరిగా మెలగకపోవడం, అలాగే షూటింగ్ సమయంలో ఎవరితోనూ సరిగా మాట్లాడక పోవడం వంటి కారణాల చేత ఆమెకు ఆ హీరోకు గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో ఆ హీరో ఇలియానాకి టాలీవుడ్ లో అవకాశాలు రాకుండా చేసాడని అందుకే ఈ అమ్మడు అవకాశాల కోసం బాలీవుడ్ వైపు వెళ్లిందని తెలుగు సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతేగాక ఆమెతో సన్నిహితంగా ఉండే ఒక తెలుగు దర్శకుడు ఇద్దరి మధ్య మంతనాలు జరిపి ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం.
అయితే చూడాలి మరి ఈ గుసగుసలపై ఇలియానా ఎలా స్పందిస్తుందో.
.