అప్పట్లో నితిన్ హీరోగా నటించినటువంటి జయం చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇందులో ముఖ్యంగా హీరోగా నటించినటువంటి రవి కుమార్ ఈ చిత్రం ఘన విజయం సాధించినందుకు గాను జయం రవి పేరు కూడా మార్చుకున్నారు.
అయితే ఎప్పుడు విభిన్న కథనాలు ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే జయం రవి గురించి చెప్పనవసరం లేదు.అంతేగాక ఇతడికి నటన పట్ల ఎంతో అంకితభావం ఉంటుంది.
అయితే జయం రవి ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి కి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జయం రవి గుండు చేయించుకున్న వ్యక్తి పాత్రలో నటిస్తునందున అతడు ఇప్పటికే గుండు చేయించుకున్నాడు.మామూలుగా చిత్ర పరిశ్రమలోని హీరోలు గ్లామర్ గా లేని పాత్రల్లో నటించడానికి ఎంతగానో సంకోచిస్తారు.
కానీ జయం రవి అలాంటి వేమి పట్టించుకోకుండా తన పాత్రకి తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్, విక్రమ్, అమితాబ్ బచ్చన్, కార్తీ, త్రిష, మోహన్ బాబు, ఐశ్వర్యరాయ్,పార్తిబన్, జయరామ్, వంటి ప్రముఖ నటులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రాచుర్యం పొందిన టువంటి దాదాపు అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.
పలువురు ప్రముఖ నటులు నటిస్తున్న ఈ చిత్రంపై తమ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.