టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రానికి ఎఫ్2 ఫేమ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా కలిసి నిర్మించారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించగా టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్, సీనియర్ నటి సంగీత వంటి వాళ్లు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా నిర్వహించారు అయితే ఈ వేడుకకు చిరంజీవి మరియు విజయశాంతిలు హాజరయ్యారు.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనవుతూ దాదాపుగా 13 ఏళ్ల తర్వాత విజయశాంతిని మళ్లీ సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇచ్చినటువంటి మహేష్ బాబుకి థాంక్స్ చెప్పారు.అంతే కాక ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ విజయశాంతి సినిమాల్లో నటించడ తనకు చాలా ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు.
అలాగే విజయశాంతి, చిరు అభిమానులు కూడా మహేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ప్రతి సోమవారం నుంచి శనివారం వరకూ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ స్టార్ మా లో ప్రసారమయ్యేటువంటి కార్తీకదీపం సీరియల్ టీ ఆర్పి రేటింగులు పరంగా దూసుకుపోతోంది.అయితే ఇందులో డాక్టర్ బాబు కార్తీక్ మరియు వంటలక్క దీపా ఎప్పుడు కలుస్తారా అంటూ అభిమానులు రోజురోజుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.కానీ డైరెక్టర్ మాత్రం వారి కలయికను రోజురోజుకి వాయిదా వేస్తూ వెళ్తున్నాడు.
దీంతో వంటలక్క దీప పడే కష్టాలు చూడలేక పోతున్న అభిమానులు వెంటనే కార్తీక్ బాబుతో దీపాన్ని కలపాలంటూ మహేష్ బాబునీ కోరుతున్నారు.
ఎలాగైతే పదమూడేళ్ల తర్వాత చిరంజీవి మరియు విజయశాంతి లను కలిపాడో కొంచెం పెద్ద మనసు చేసుకొని వంటలక్క దీపని కార్తీక్ బాబుని కలిపి పుణ్యం కట్టుకోండి అంటూ పలువురు నెటిజన్లు మహేష్ బాబుని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.అయితే మహేష్ బాబు ఈ వార్తపై ఏ విధంగా స్పందిస్తాడు చూడాలి.