‘దబాంగ్ 3’ని దెబ్బతీయడానికి అక్షయ్ కుట్ర పన్ను తున్నాడా....?

బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే చాలు ప్రతీ ఒక్కరూ తమని తాము క్రిటిక్స్ లాగ ఫీలవుతూ జోస్యం చెబుతుంటారు.అయితే ఈ నెలలో అక్షయ కుమార్ నటించిన “గుడ్ న్యూస్”, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన “దబాంగ్ 3” భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి.

 Latest News About Dabang 3 And Good Newwz Movies-TeluguStop.com

  దీంతో తనని తాను ప్రముఖ సినీ విమర్శకుడు అనుకునే కమల్ ఆర్ ఖాన్ ఈ రెండు చిత్రాలపైన సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Telugu Dabang, Diljit, Newwz, Kareena Kapoor, Kiara Adwani, Latestdabang, Latest

ఇందులో భాగంగా తన తాజా సర్వే సమాచారం ప్రకారం ప్రభుదేవా దర్శత్వంలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, కిచ్చా సుదీప్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన “దబాంగ్ 3” చిత్రాన్ని 54 శాతం మంది ప్రేక్షకులు చూడలనుకుంటున్నారని,  అలాగే ప్రముఖ దర్శకుడు రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ,  దిలీజిత్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన “గుడ్ న్యూస్” చిత్రాన్ని 55 శాతం మంది చూడాలనుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.అనంతరం సల్మాన్, అక్షయ కుమార్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

 అంతేగాక ఈ రెండు భారీ చిత్రాలు విడుదలైన మొదటి రోజున 25 కోట్ల నుంచి 35కోట్ల రూపాయలు వసూళ్లను రాబడుతాయని జోస్య చెప్పారు.

అలాగే  దబాంగ్ 3 చిత్రాన్ని దెబ్బతీయడానికి అక్షయ్ కుమార్, కరణ్ జోహార్ తదితరులు కుట్ర పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.అయితే ఈ వ్యాఖ్యలఫై సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube