మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అభిమానులు పెద్ద అంచనాలనే పెట్టుకున్నారు.
ఈ సినిమా మే లోనే విడుదల చేస్తున్నామని ప్రకటించినా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఇప్పటి వరకు రిలీజ్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
సెకండ్ వేవ్ తర్వాత ఆచార్య దసరా కానుకగా వస్తుందని అందరు భావించినా ఏ విషయం కన్ఫర్మ్ చేయకపోవడంతో ఎప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇప్పటికే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.ప్రెసెంట్ చిత్ర యూనిట్ ఈ రెండు పాటల్లో ఒక పాటను షూట్ చేస్తున్నారట.ఆ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.
ఈ సాంగ్ రెండు రోజుల్లో పూర్తి అవ్వబోతుండగా మరొక పాటను ఎప్పుడు షూట్ చేస్తారో తెలియదు.ఇక ఈ రెండు పాటలు పూర్తి అయితే సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయినట్టే.ఇక ఈ క్రమంలో త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంది.ఇక ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.రామ్ చరణ్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుంది.