తెలుగు సినీ అలనాటి నటి ఇంద్రజ. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.
హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ.ఇప్పటికీ సహాయనటిగా ఇండస్ట్రీలో సాగుతుంది.
అంతేకాకుండా బుల్లితెరలో కూడా ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చింది.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో రోజా ప్లేస్ లో జడ్జిగా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది ఇంద్రజ.
తన అందం, నవ్వుతో బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ కి వాలిపోయేలా చేసింది.
కమెడియన్స్ తో కూడా బాగా ఇంటరాక్ట్ అవుతూ తాను కూడా పంచులు వేస్తుంది.ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇప్పటికి కూడా అందాన్ని పెంచుకుంటూ పోతుంది ఇంద్రజ.ఇక ఇంద్రజ వర్షంలో రెచ్చిపోయి డాన్స్ చేయగా వెంటనే సుడిగాలి సుధీర్ ఓ మాట అనేశాడు.
సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
అన్ని రకాల వినోదాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు.ఇక ఇందులో బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలు కూడా పాల్గొంటున్నారు.తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో బాగా సందడి కనిపించింది.
ఈ షో 25వ ఎపిసోడ్ సందర్భంగా ఇంద్రజ, లైలా లు పాల్గొన్నారు.
ఇందులో ఇంద్రజ తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో తెగ సందడి చేసింది.
వర్షపు చినుకులలో తడిసినట్లు అలరిస్తూ.మేఘా మేఘా అంటూ స్టేప్పులతో రెచ్చిపోయింది.మధ్యలో లైలా కూడా డాన్స్ చేయడంతో వేదిక మొత్తం ఓ పండగల కనిపించింది.ఇక ఆమె దాదాపు 18 ఏళ్ల తర్వాత చేశానని చెప్పింది ఇంద్రజ.ఇక అంతలో సుడిగాలి సుధీర్. సాంగ్ పర్ఫామెన్ చేసి పద్దెనిమిదేళ్లు అయ్యిందట.
కానీ 18 ఏళ్ల పిల్లలా చేశారు అంటూ అనేసాడు.ఇక ఈ ఎపిసోడ్ ను ఇంద్రజ కోసం చూడటానికి వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.