ఉదయ్ కిరణ్.ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు.2000లో ఒక రికార్డు సృష్టించిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఉదయ్ కిరణే.తీసిన ప్రతి సినిమా అద్భుతం.
రికార్డు మీద రికార్డు సృష్టించాడు.అప్పటి యువతకు నచ్చిన మెచ్చిన హీరో ఉదయ్ కిరణ్.
మొదటి సినిమా ”చిత్రం”.ఈ సినిమాను చూసిన యువత ఎంతోమంది ప్రేమించి లేచిపోయారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయ్.
ఇక ఆతర్వాత ఉదయ్ కిరణ్ తీసిన సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఏ హీరోకు రాని క్రేజ్ ఉదయ్ కిరణ్ కి వచ్చింది.ఇక అలాంటి స్టార్ హీరో కాస్త కొన్ని ఘటనలతో అసలు హీరోగానే నిలవలేకపోయాడు.
ఉదయ్ కిరణ్ దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఉదయ్ కిరణ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది.తన గురించి ఎవరిని కదిలించినా మాట్లాడతారు.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాలను అందుకుంటూ టాప్ హీరోల స్థాయి లో ఉన్న ఉదయ్ కిరణ్ ని చూసి అగ్ర హీరోలు సైతం వణికిపోయారు.ఉదయ్ కిరణ్ విజయాలను చూసి ఓర్వలేక కొందరు అతని నాశనం చేశారని వార్తలు కూడా ఇండస్ట్రీలో మార్మోగి పోయాయి.
ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్ తో రెండు సినిమాలు చేసిన దర్శకుడు విఎన్ ఆదిత్య పలు చానళ్లలో ఉదయ్ కిరణ్ తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశాడు.ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే, శ్రీరామ్ చిత్రాలకు ఆదిత్య దర్శకత్వం వహించారు.రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తోనిర్మించిన మనసంతా నువ్వే చిత్రం 16 కోట్లను వసూలు చేసింది. శ్రీరామ్ సినిమా యావరేజ్ గా ఆడిన నిర్మాతలకు లాభాలను అందించిందని దర్శకుడు ఆదిత్య తెలిపారు.
అప్పట్లో ఉదయ్ కిరణ్ కి ఉన్న మార్కెట్ చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు.ఉదయ్ కిరణ్ నటించిన తొలి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో వరుస అవకాశాలతో స్టార్ హీరోగా మారిపోయాడు.ఇప్పుడు కానీ అలాంటి హిట్స్ కొడితే ఉదయ్ కిరణ్ రేంజ్ మార్కెట్లో 400 కోట్ల రూపాయలు ఉంటుందని దర్శకుడు తెలిపారు.ఉదయ్ కిరణ్ మరణ విషయానికొస్తే అసలు తనకి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా లేదంటూ దర్శకుడు తెలిపారు.
చనిపోవడానికి ముందు రోజు కూడా తనతో ఎంతో బాగా మాట్లాడారని, చనిపోవాలని ఆలోచన కేవలం క్షణికావేశంలో వచ్చిందని దర్శకుడు ఆదిత్య ఉదయ్ కిరణ్ తో ఉన్న అనుబంధం గురించి తెలియ జేశాడు.