వేర్వేరు కారణాల వల్ల సంవత్సరాల పాటు విడిపోయిన రవిలాస్య జోడీ మళ్లీ బిజీ అవుతూ జంటగా బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు.ఒకప్పుడు రవి లాస్య కలిసి యాంకరింగ్ చేయగా ఇప్పుడు మాత్రం స్టార్ మా ఛానెల్ లో స్కిట్లు చేస్తుండటం గమనార్హం.
గత కొన్ని వారాలుగా కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో రవిలాస్య చేస్తున్న స్కిట్లు ప్రసారం కావడంతో పాటు ప్రేక్షకులకు ఆ స్కిట్లు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి.
తాజాగా విడుదలైన ప్రోమోలో లాస్య చంద్రముఖి గెటప్ లో దర్శనమిచ్చారు.
కమెడియన్ తో రవి నీ పేరు ఏదో ఉంది మర్చిపోయా అని చెప్పగా కమెడియన్ ఊర్మిళ అని చెబుతాడు.ఆ తరువాత గట్టిగా ఉరిమినప్పుడు తాను పుట్టానని అందుకే ఊర్మిళ అని పేరు పెట్టారని చెబుతాడు.
ఆ తరువాత లాస్య రవి, కమెడియన్ ను అన్నం వడ్డించమంటారా.? అని అడుగుతోంది.కూర్చున్నది ఎందుకు తినడానికే కదా అని కమెడియన్ సమాధానం ఇస్తాడు.
ఆ తరువాత లాస్య డైనింగ్ టేబుల్ ను తోసేసి నన్ను నా పప్పునే అంటావా నువ్వు.? అని అంటారు.ఆ తరువాత స్కిట్ లోకి ఎక్స్ ప్రెస్ హరి ఎంట్రీ ఇచ్చి కాలికి గజ్జెలు కట్టేసుకుని .ముఖానికి మేకప్ వేసేసుకుని.పెదాలకు లిప్ స్టిక్ రాసేసుకొని బాబా భాస్కర్ లా ఇలా స్టెప్పులేస్తే భయపడిపోతాననుకున్నావా అని చెబుతుండగానే లాస్య ఎక్స్ ప్రెస్ రవిని చితకబాదుతుంది.
రవిలాస్య జోడీ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.
రేపు మధ్యాహ్నం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
మరోవైపు ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి కలిసి చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.అరియానా కూడా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇన్ని రోజులు హాజరు కాలేకపోయినా త్వరలో ఆమె కూడా ఈ షోకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.