అమెరికాలో మరో సారి జాతి విద్వేష దాడులు బయటపడ్డాయి.ఈ సారి ఈ దాడి 8 వ తరగతి చదువుతున్న ఓ నల్లజాతీయురాలైన బాలికపై జరిగింది.
ఈ దాడిని అమెరికా వ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు.అంతేకాదు ఈ దాడి చేసింది 17 ఏళ్ళ వయసు ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు కావడం మరొక సంచలనంగా మారింది.
ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే.వారు ఆ దాడి సమయంలో తెలుగు యాసతో మాట్లాడారు అంటూ ఫిర్యాదులో పెర్కొన్నారట.
వివరాలలోకి వెళ్తే.
న్యూజెర్సీ లోని లారెన్స్ టౌన్ షిప్ లో నివసించే ఇద్దరు కుర్రాళ్ళు లారెన్స్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నారు.
ఈ క్రమంలోనే ఫుడ్ బాల్ గేమ్ ఆడుతున్న సమయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ నల్లజాతీయురలైన విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.ఆ బాలికపై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ బాధించడమే కాకుండా వారిలో ఒకడు ఆమెపై మూత్రం కూడా పోశారని తెలుస్తోంది.
దాంతో తన కూతురికి జరిగిన ఈ అన్యాయంపై భాదపడిన ఆమె తండ్రి సోషల్ మీడియాలో ఈ అన్యాయం గురించి పోస్ట్ పెట్టారు.జాతి విద్వేషం అనేది క్యాన్సర్ లాంటిదని అలాంటి పద్దతిని నేను ఖండిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు ఆ ఇద్దరు కుర్రాళ్ళపై చర్యలు తీసుకోవాలని చాలామంది పట్టుబడుతున్నారు.