తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే కేసీఆర్ భర్తరఫ్ ఎపిసోడ్ తర్వాత ఈటెలకు కేసీఆర్ కు మధ్య మాటల తూటాలు పేలడం, అదే విధంగా మంత్రి గంగుల ఈటెల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ లో మంత్రి గంగుల ఆధిపత్యం చలాయించడం, ఇప్పటివరకు ఎంతో కొంత టీఆర్ఎస్ పై సంయమనం పాటించిన ఈటెల మంత్రి గంగుల వైఖరితో ఇక తన రాజకీయ చానక్యానికి పదునుపెట్టక తప్పని పరిస్థితులలో, ఇటు కార్యకర్తలను కూడా తన వైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రయత్నాలు చేస్తే క్షేత్ర శతాటి క్యాడర్ దెబ్బ తినే అవకాశం ఉండనున్న నేపథ్యంలో ఈటెల సహజంగా బీజేపీ సిద్దాంతాలు నచ్చవనే విషయం తెలిసిందే.
అయితే ఇక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భట్టితో భేటీ సమయంలో కాంగ్రెస్ లో చేరికపై కొంత క్లారిటీ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.దీంతో ఇప్పటికే సోనియా గాంధి అపాయింట్ మెంట్ కోరిన కాంగ్రెస్ నేతలు త్వరలో ఈటెలను సోనియా గాంధీతో భేటీకి సమాయత్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంకా ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కాని, ఈటెల కాని స్పందించలేదు.కాని నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు, ఇందులో ఎంతో కొంత వాస్తవం లేకపోతే ఊహాగానాలు ఎందుకు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.