లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తో ఆర్జీవి ఏపీ ఎన్నికలలో కాక పుట్టించాలని ప్రయత్నం చేసాడు.టీడీపీ అధినేత చంద్రబాబుకి స్ట్రోక్ ఇవ్వాలని భావించాడు.
అయితే ఊహించని విధంగా టీడీపీ ఫిర్యాదు మేరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపేయాలని హై కోర్ట్ తీర్పు చెప్పింది.ఎన్నికలు పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.
అయితే దీనిపై ఆర్జీవితో పాటు, నిర్మాతలు న్యాయపోరాటంకి సిద్ధం అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాకున్నా విదేశాలలో మాత్రం రిలీజ్ అయ్యింది.
ఇప్పటికే ఓవర్సీస్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి.ఇప్పుడు ఓవర్సీస్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టాక్ కాస్తా బయటకి వచ్చింది.
ఇక ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ముందు నుంచి ఊహించినట్లుగానే లక్ష్మి పార్వతి కోణంలోనే ఆవిష్కరించాడని తెలుస్తుంది.ఆమె పాత్రని చాలా సాఫ్ట్ గా డిజైన్ చేసి, ఎన్టీఆర్ ని అమితంగా ప్రేమించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేసాడు.
అదే సమయంలో చంద్రబాబు పాత్రని నెగిటివ్ యాగిల్ లో చూపించి, తన రాజకీయ ఉనికి కోసం నందమూరి ఫ్యామిలీ మొత్తాన్ని ఎన్టీఆర్ కి ఎలా దూరం చేసాడు.అలాగే తెలుగు దేశం పార్టీని తన చేతుల్లోకి ఎలా తీసుకున్నాడు.
ఎన్టీఆర్ కి సన్నిహితంగా ఉంటూనే ఎలాంటి కుట్రలు చేసాడు అనే విషయాలని తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తుంది.ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు సినిమాకి మెయిన్ విలన్గా ఆర్జీవి తీర్చి దిద్దాడు.అయితే వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఎన్టీఆర్ పాత్రలో నటించిన రంగస్థల నటుడు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని తెలుస్తుంది.
ఓవరాల్ గా ఆర్జీవి గత సినిమాల మాదిరి కాకుండా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆర్జీవి ఆవిష్కరించాడు అని టాక్ వినిపిస్తుంది.