ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మరియు తెలుగు దేశం పార్టీ శ్రేణులను తెగ కంగారు పెడుతున్న రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు.ట్రైలర్తోనే వర్మ ఈ చిత్రంలో ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంను మార్చి 25న విడుదల చేయాలని భావిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ పక్కాగా ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడును విలన్గా చూపించబోతున్న విషయం ఇప్పటికే క్లారిటీగా తేలిపోయింది.అయితే ఆ విషయంలో నందమూరి కుటుంబ సభ్యులు సీరియస్గా ఉన్నారని, సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే వర్మ సినిమా విడుదల తేదీ ప్రకటించి హడావుడి చేయకుండా నేరుగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు.
అందుకే మార్చి 15వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నా కూడా విడుదల తేదీ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.
ప్రస్తుతం సినిమాపై సినీ వర్గాల్లో జనాల్లో చాలా ఆసక్తి ఉంది.వర్మ ఈ చిత్రంలో అత్యంత సున్నితమైన అంశాలను టచ్ చేస్తున్నాడు.ఇప్పటి వరకు కీలకమైన విషయాలను తెలియకుండా దాచేశారు అంటూ వర్మ చెబుతూ వస్తున్నాడు.
ఆ సమయంలో ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకోవడం, ఆయన పడ్డ క్షోభను అప్పట్లో మీడియాలో చూపించలేదని, తాను ఇప్పుడు ఆ విషయాలను చూపిస్తానంటూ వర్మ చెబుతున్నాడు.మార్చి 15న విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తెలుగు దేశం నాయకులకు పెద్ద జలక్ ఇవ్వడం ఖాయంగా సినీ వర్గాల వారు కూడా అంటున్నారు.