ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.ఈ క్రమంలో ఆయన భార్య లక్ష్మీపార్వతి కూడా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.
ఎన్టీఆర్ పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదని, ప్రతి ఒక్క నాయకుడికి ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ఆయన ఆశయాల తోనే ముందుకు వెళుతున్నారని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పాలన జరుగుతుందని లక్ష్మీపార్వతి జగన్ పాలన పై షాకింగ్ కామెంట్ చేశారు.
అదేవిధంగా ఈ ఏడాది జనవరి మొదటి తారీకు నాడు మనవడు పుట్టారని.దీంతో “చిన్న ఎన్టీఆర్” అని పేరు అతనికి నేను పెట్టడం జరిగిందని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా మనవడిని పెంచుతాను అంటూ స్పష్టం చేశారు.