వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది తెలుగు దేశం పార్టీ నాయకుల్లో మరియు నందమూరి అభిమానుల్లో ఆసక్తి, టెన్షన్ పెరిగి పోతుంది.తాజాగా సినిమాను లక్ష్మీ పార్వతి ప్రత్యేక షోతో చూడటం జరిగిందట.
ఆమెను సినిమా మెప్పించిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.తాజాగా లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.
ఆమె మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం అందరి బండారాలను బయట పెట్టడం ఖాయం అంటూ వ్యాఖ్యలు చేసింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు నాయుడుతో పాటు అప్పట్లో ఎన్టీఆర్ గారికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి గురించి ఉందని, తప్పకుండా వారందరు ప్రజా కోర్టులో దోషులుగా నిలవడం ఖాయం అంటూ లక్ష్మీ పార్వతి అంటోంది.లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ వారిలో మరింత టెన్షన్కు గురి చేస్తోంది.చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజకీయంగా కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.
సీఎం అయిన చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పెద్ద తలనొప్పి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రామ్ గోపాల్ వర్మ ఏ విషయాలను ఎలా చూపాలి, వివాదాన్ని ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి.నేరుగా చంద్రబాబు నాయుడు పేరును వాడి లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఆయనకు సంబంధించిన కొన్ని సీన్స్ను ఈ చిత్రంలో పెట్టడంతో ఆయన భవిష్యత్తుపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.ఇంతటి దారుణమైన పరిస్థితి నేపథ్యంలో సినిమాను ఆపేందుకు తెలుగు దేశం పార్టీ వారు ప్రయత్నాలు చేయడం ఖాయం.అయితే వారి ప్రయత్నాలు సఫలం అవుతాయా లేదా అనేది చూడాలి.