లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెర లేపిన విషయం తెల్సిందే.లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ట్రైలర్ లోనే సినిమా మొత్తాన్ని చూపించాడు.ఒక షాట్ లో మోహన్ బాబును కూడా వర్మ కవర్ చేశాడు.
ఎన్టీఆర్కు వెన్ను పోటు సమయంలో మోహన్ బాబు కూడా ఆయనకు దూరం అయ్యాడు అంటూ లక్ష్మీ పార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్ గారిని మోహన్ బాబు చాలా గౌరవించే వాడు.అన్న అనే గౌరవంను ప్రదర్శించే వాడు.కాని ఆ సమయంలో మాత్రం మోహన్ బాబు కూడా చంద్రబాబు నాయుడును సపోర్ట్ చేశాడు.
ఎన్టీఆర్ తీరుపై అప్పట్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్టీఆర్ గారి గురించి మోహన్బాబు అప్పట్లో తప్పుడు ఉద్దేశ్యంతో ఆలోచించాడు.
అందుకే చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచాడు.కాని ఆ తర్వాత కొన్నాళ్లకు తాను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు.
నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు.క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు గురించి తానెప్పుడు వ్యాఖ్యలు చేయలేదు,
మోహన్బాబు మాత్రమే కాకుండా ఆ సమయంలో ఆయన్ను మోసం చేసి, చంద్రబాబు నాయుడు పంచన చేరిన వారు ఆ తర్వాత నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు.ఎం చెప్పినా, ఎంత చేసినా ఏం లాభం ఆ సమయంలో జరిగిన నష్టాన్ని మరెవ్వరు భర్తీ చేయలేరు కదా అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరి బండారం బయట పడుతుందని లక్ష్మీ పార్వతి ధీమా వ్యక్తం చేస్తుంది.
వర్మకు మాత్రమే ఈ స్థాయి దమ్ము ధైర్యం ఉందని ఆమె చెప్పుకొచ్చింది.