వివాదాస్పద దర్శకుడు ఆర్జివి తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమాని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉందని ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుపడింది.
ఇక తాజాగా ఈ సినిమాని ఏపీ లో రిలీజ్ చేయడానికి రాంగోపాల్ వర్మ సిద్ధమయ్యారు.అయితే రిలీజ్ ముందు ఏపీ ఎలక్షన్ కమిషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి మరోసారి అడ్డుపడింది అనే సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఎలక్షన్ కమిషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఏపీలో లో కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాని రిలీజ్ చేశారు.దీంతో ఎలక్షన్ కమిషన్ సినిమా రిలీజ్ చేసిన థియేటర్ పై కొరడా ఝులిపించింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేసిన థియేటర్లను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఈనెల 1వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించిన మూడు థియేటర్లను రెవెన్యూ అధికారులు తాజాగా సీజ్ చేశారు.