ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు లో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల జయ జయ ద్వానాలు మధ్య పరిణయ వేడుకను కనుల పండుగగా నిర్వహించారు.
అశేష జనవాహిని స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు.